Nayanthara Chakravarthy : మాలీవుడ్ బ్యూటీకీ బంపర్ ఆఫర్..!
Nayanthara Chakravarthy : యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మూవీ 'జెంటిల్మెన్'.. కె.టి. కుంజుమోన్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది..1993లో రిలీజైన ఈ సినిమాలో అర్జున్ సరసన మధుభాల, శుభశ్రీ హీరోయిన్లుగా నటించారు.
అయితే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. జెంటిల్మెన్కి సీక్వెల్ తీస్తున్నట్లు 2020లోనే ప్రకటించారు నిర్మాత కుంజుమోన్... అయితే ఈ సినిమాలో హీరోయిన్గా మాలీవుడ్ బ్యూటీ నయనతార చక్రవర్తిని ఫైనల్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాతే ప్రకటించారు.
ఇంకా ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరనే విషయం మేకర్స్ వెల్లడించలేదు. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎంఎం కీరవాణిని ఎంపిక చేశారు. కాగా నయనతార చక్రవర్తి తెలుగులో బాలకృష్ణ కథానాయకుడు మూవీలో నటించింది.
Happy to Introduce #NayantharaaChakravarthy as the lead actress in #Gentlemen2#ஜென்டில்மேன்2 #ജെന്റിൽമാൻ2#జెంటిల్మాన్2#ಜಂಟಲ್ಮನ್2@mmkeeravaani #GentlemanFilmInternational@ajay_64403 @johnsoncinepro @UrsVamsiShekar @Fridaymedia2
— K.T.Kunjumon (@KT_Kunjumon) March 23, 2022
Another lead actress will be revealed soon pic.twitter.com/2MMkuCHF6N
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com