Nayanthara: సీక్రెట్‌గా పెళ్లి చేసేసుకున్న నయనతార.. త్వరలోనే సరోగసికి ప్లాన్..

Nayanthara: సీక్రెట్‌గా పెళ్లి చేసేసుకున్న నయనతార.. త్వరలోనే సరోగసికి ప్లాన్..
Nayanthara: ఇటీవల విఘ్నేష్, నయన్ తమిళనాడులోని అమ్మవారి ఆలయానికి వెళ్లారు.

Nayanthara: సౌత్‌లో అన్ని జోనర్లలో సినిమాలు చేసి.. దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టి లేడీ సూపర్ స్టార్ అని పేరు తెచ్చుకుంది నయనతార. తను గత ఆరేళ్లుగా కోలీవుడ్ డైరెక్టర్‌ విఘ్నేష్ శివన్‌తో రిలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన 'నానుమ్ రౌడీ ధాన్' సినిమా సమయంలో వీరు ప్రేమలో పడ్డారు. అయితే తాజాగా వీరిద్దరికి పెళ్లి కూడా అయిపోయిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతే కాకుండా సరోగసి గురించి కూడా నయన్ అప్పుడే ఓ నిర్ణయానికి వచ్చిందట.

నయనతార, విఘ్నేష్ శివన్ ఆరేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. 2021లో పెద్దగా హడావిడి లేకుండా వీరిద్దరూ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. అప్పటినుండి ట్రిప్స్‌కు వెళ్తూ.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. తమ మూమెంట్స్‌ను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. అయితే ఓసారి ఓ అభిమాని విఘ్నేష్‌ను పెళ్లి గురించి అడగగా కోవిడ్ తర్వాత ఉండవచ్చని చెప్పాడు.

ఇటీవల విఘ్నేష్, నయన్ తమిళనాడులోని అమ్మవారి ఆలయానికి వెళ్లారు. అక్కడ వీరిద్దరినీ చూసిన అభిమానులు ఫోటోలు, వీడియోలు తీయడం మొదలుపెట్టారు. ఆ వీడియోల్లో నయనతార తన నుదుటిపై కుంకుమతో కనిపించింది. దీంతో వీరు ఎంగేజ్‌మెంట్‌లాగానే పెళ్లిని కూడా సీక్రెట్‌గా జరిపించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఎప్పుడూ చేతినిండా సినిమాలతో బిజీగా ఉండే నయనతార.. తల్లి కావడానికి సరోగసి మార్గాన్ని ఎంచుకోనుందని టాక్ వినిపిస్తోంది. అయితే దీని గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా.. వీరి అప్పుడే పిల్లల గురించి ప్లాన్ చేస్తున్నారు అని కోలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి. మరి విఘ్నేష్, నయన్.. వారి పెళ్లిని ఎప్పుడు అఫీషియల్ చేస్తారో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story