NTR 30 : ఎన్టీఆర్ తో సాయిపల్లవి.. ఫైనల్ చేసిన కొరటాల

NTR 30 :  ఎన్టీఆర్ తో సాయిపల్లవి.. ఫైనల్ చేసిన కొరటాల
NTR 30 : RRR మూవీ తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ ఓ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నాయి.

NTR 30 : RRR మూవీ తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ ఓ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నాయి. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో వస్తోన్న మూవీ కావడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. వచ్చే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

కాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా సాయి పల్లవి ఫైనల్ అయినట్టుగా సమాచారం. నటనలోనూ, డాన్స్ లోనూ ఎన్టీఆర్ కి ధీటుగా ఉంటుందని సాయిపల్లవి ఐతే బాగుంటుందని కొరటాల భావించి ఆమెను సంప్రదించారని తెలుస్తోంది. దీనిపైన అఫీషియల్ గా ప్రకటన రావాల్సి ఉంది.

కాగా ముందుగా ఈ సినిమా కోసం హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌ను తీసుకున్నారు.. ఆ తర్వాత ఆమె పెళ్లి కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో రష్మికని తీసుకునట్టుగా వార్తలు వచ్చాయి..ఇప్పుడా ప్లేస్ లో సాయి పల్లవి పేరు వినిపిస్తోంది. అటు టాలీవుడ్ లో ఎన్టీఆర్, సాయిపల్లవి కాంబో గురించి ఎప్పటినుంచో చర్చ నడుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story