Sai Pallavi : సీక్రెట్ గా మహేష్ సినిమాని చూసిన హైబ్రిడ్ పిల్ల

Sai Pallavi :  సీక్రెట్ గా మహేష్ సినిమాని చూసిన హైబ్రిడ్ పిల్ల
Sai Pallavi : అయితే ఈ సినిమాని సిక్రెట్ గా వాచ్ చేసింది హీరోయిన్ సాయిపల్లవి.. హైదరాబాద్‌లోని పీవీఆర్‌ ఆర్‌కే కాంప్లెక్స్‌లో సినిమాని చూసింది.

Sai Pallavi : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట... గీతా గోవిందం ఫేమ్ పరుశురాం డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాని సిక్రెట్ గా వాచ్ చేసింది హీరోయిన్ సాయిపల్లవి.. హైదరాబాద్‌లోని పీవీఆర్‌ ఆర్‌కే కాంప్లెక్స్‌లో సినిమాని చూసింది.

ముఖానికి స్కార్ఫ్ అడ్డుపెట్టుకొని, చేతిలో బ్యాగ్ తో కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా సాయిపల్లవి మహేష్ బాబుకి పెద్ద అభిమాని అన్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ కలిసి సంయుక్తంగా నిర్మించగా సర్కారు వారి పాట చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోన్న మహేష్.. త్రివిక్రమ్ సినిమాకి త్వరలోనే షిఫ్ట్ కానున్నారు. ఆ తర్వాత రాజమౌళి సినిమాకి కమిట్ అయ్యారు మహేష్.

Tags

Read MoreRead Less
Next Story