Sarkaru Vaari Paata : ఫిక్స్ .. మహేష్ ఫ్యాన్స్ గెట్ రెడీ... మే 07న ప్రీరిలీజ్ ఈవెంట్... !
Sarkaru Vaari Paata : సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి వస్తోన్న మూవీ సర్కారు వారి పాట.. మే12న భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ చిత్రం.. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రమోషన్ పైన ఫోకస్ చేసింది. అందులో భాగంగానే చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 7న హైదరాబాద్లోని యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్నట్టుగా అఫీషియల్ గా వెల్లడించింది. సాయంత్రం 6 గంటల నుంచి గ్రాండ్ ప్రీ రిలీజ్ ప్రమోషనల్ ఈవెంట్ జరగనుంది.
అయితే ఈ ఈవెంట్కి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ను ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. దీనిపైన అధికార ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ సినిమాలో మహేష్ కి జోడీగా మహానటి ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. భారీ బడ్జెట్ యాక్షన్, రొమాంటిక్ మరియు కామెడీ డ్రామాగా తెరకెక్కిన సర్కారు వారి పాట చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ మరియు GMB ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మించగా, థమన్ సంగీతం అందించాడు. సినిమా పైన భారీ అంచనాలున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com