Shruti Haasan : కరోనా బారిన పడిన శృతిహాసన్...!
By - TV5 Digital Team |27 Feb 2022 11:30 AM GMT
Shruti Haasan : హీరోయిన్ శృతిహాసన్ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని అమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
Shruti Haasan : హీరోయిన్ శృతిహాసన్ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని అమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. "అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వచ్చింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వచ్చేందుకు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను " అంటూ పోస్ట్ చేసింది శృతిహాసన్. కాగా ప్రస్తుతం ఆమె రెండు బడా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తోన్న పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక బాలకృష్ణ, గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో వస్తోన్న మూవీలో హీరోయిన్ గా కనిపించనుంది శృతి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com