wanaparthy : వనపర్తిలో దారుణం... 9వ తరగతి బాలికపై ఇద్దరు వ్యక్తుల అత్యాచారం
wanaparthy : వనపర్తి జిల్లాల్లో ఇద్దరు వ్యక్తులు ఉన్మాదుల్లా ప్రవర్తించి 9వ తరగతి బాలికపై అత్యాచారం చేశారు. స్కూల్కు వెళ్తున్న బాలికను దారిలో అడ్డగించి ఎత్తుకెళ్లి దారుణానికి పాల్పడ్డారు. తర్వాత బాలికను స్కూల్ వద్ద వదిలేసి పరారయ్యారు. బాధితురాలు ఏడుస్తుండడంతో ఏం జరిగిందో ఆరా తీసిన టీచర్లు వెంటనే జరిగిన దారుణంపై తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. వనపర్తి జిల్లా పానగల్ మండలం మల్లయిపల్లి గ్రామానికి చెందిన బాలిక.. స్కూల్కి వెళ్తుండగా అడ్డగించిన అనిల్, నాగరాజు అనే వ్యక్తులు ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి రేప్ చేశారు. వీళ్లిద్దరిపై ఇప్పుడు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అటు, చింతకుంట ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన డీఎస్పీ కిరణ్ కుమార్.. ఈ కేసుపై విచారణ జరిపారు. నిందితుల్ని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బలగాల్ని రంగంలోకి దించారు. అటు.. అత్యాచార ఘటనలో దోషుల్ని కఠినంగా శిక్షించాలంటూ విద్యార్థి సంఘాలు, దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com