విద్యార్థినిపై అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష

విద్యార్థినిపై అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
సమీపంలోని తోటలోకి స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు వెళ్లింది. అక్కడ బాలికపై

అత్యాచారం చేసిన నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కడలూరు జిల్లా కోర్టు సత్వరమే తీర్పు చెప్పడం ముదావహం. శిక్షలు కఠినంగా ఉండడంతో పాటు తీర్పులు సకాలంలో జరిగితే తప్ప అత్యాచారాలను అరికట్టడం సాధ్యం కాదు. 2019లో ఈ సంఘటన జరిగింది.

చైన్నై కడలూరు జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి విరుదాచలంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లింది. సమీపంలోని తోటలోకి స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు వెళ్లింది. అక్కడ బాలికపై మూతామూరైకు చెందిన సెల్వకుమార్ (30) అనే యువకుడు అత్యాచారం చేశాడు.

బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు.. కేసు విచారణ చేపట్టి సెల్వకుమార్‌ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కేసు జిల్లాలోని పోక్సో ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో నిందితుడు నేరం చేసినట్లు తేలడంతో 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. దీంతో పాటు 4వేలు రూపాయలు జరిమానా విధించారు.

Tags

Read MoreRead Less
Next Story