ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి అన్న వరస అని తెలిసి యువతి సూసైడ్..

ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి అన్న వరస అని తెలిసి యువతి సూసైడ్..
ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి వరసకు అన్న అవుతాడని తెలియడంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది.

ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి వరసకు అన్న అవుతాడని తెలియడంతో మనస్తాపానికి గురైన యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న యువకుడు కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం నెహ్రూనగర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. శ్వేత.. కట్టుగూడెం గ్రామానికి చెందిన వెంకటేష్‌ ఇద్దరు డిగ్రీ పూర్తిచేసి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.

వెంకటేష్ తన ఇంటిపేరు తప్పుగా చెప్పి శ్వేతకు బావ అవుతానని ప్రేమలోకి దించాడు . వారం రోజుల క్రితం ఇద్దరూ హైదరాబాద్‌లో పెళ్లిచేసుకుని తర్వాత ఎవరి గ్రామాలకు వారు వెళ్లిపోయారు. రాత్రి శ్వేత తన కుటుంబ సభ్యులతో ప్రేమ పెళ్ళి వ్యవహారం చెప్పడంతో వారు అబ్బాయి పూర్తి వివరాలపై ఆరా తీశారు. చివరికి అబ్బాయి , అమ్మాయి గోత్రాలు ఒక్కటేనని తేల్చారు. దీంతో.. వరసకు అన్న అయ్యే వ్యక్తిని పెళ్లి చేసుకున్నాననే బాధతో.. మనస్తాపం చెందిన యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

ఇది తెలిసి వెంకటేష్ సైతం ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతన్ని చికిత్స కోసం ఖమ్మం తరలించారు. తమ కుమార్తె మృతికి కారణమైన యువకుడి ఇంటికి శ్వేత బంధువులు చేరుకుని ఆందోళన చేపట్టారు. అబద్ధాలు చెప్పి తమ కూతురు చావుకు కారణం అయ్యారంటూ కన్నీరుమున్నీరయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story