Hyderabad : సరూర్‌నగర్‌లో దారుణం.. నడిరోడ్డు పై పరువుహత్య..!

Hyderabad : సరూర్‌నగర్‌లో దారుణం.. నడిరోడ్డు పై పరువుహత్య..!
Hyderabad : హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై గుర్తు తెలియని వ్యక్తి ఇనుపరాడ్‌తో దాడికి పాల్పడ్డాడు.

Hyderabad : హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై గుర్తు తెలియని వ్యక్తి ఇనుపరాడ్‌తో దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన యువకుడు నాగరాజు.... అక్కడికక్కడే యువకుడు మృతి చెందారు. ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు వధువు వర్గానికి చెందిన వ్యక్తులు..... నాగరాజును హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. నిన్న రాత్రి 9 గంటల సమయంలో బెదిరింపులకు పాల్పడిన హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈఘటనతో ఆ ప్రాంతమంతా విషాదచాయలు అలుముకున్నాయి.

ఓ కార్ల షో రూమ్‌లో సేల్స్ మేన్‌గా పనిచేస్తున్న నాగరాజు.... సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా అనే యువతిని ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరి ఇష్టప్రకారమే ప్రేమ వివాహం జరిగింది. అయితే సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా కుటుంబ సభ్యులు వివాహానికి అడ్డు చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో తమకు రక్షణ కావాలని పోలీసులను కూడా నాగరాజు ఆశ్రయించాడు. ప్రస్తుతం నవ జంట సరూర్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.

నిన్న రాత్రి 9 గంటల సమయంలో నాగరాజు, సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా బైక్‌ వెళ్తుండగా... సరూర్‌నగర్ మున్సిపల్ ఆఫీసు పంజాల అనిల్ కుమార్ కాలనీ వద్ద ఇద్దరు యువకులు వారిని అడ్డగించారని.... నాగరాజు పై దాడి దాడి చేసి కొట్టి చంపారని ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. హత్యకు సంబంధించి విచారణ జరుపుతున్నామని పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీపీ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హత్య జరిగిన సంఘటన స్థలం క్లూస్ టీం ఆధారాలు సేకరించాయి. పరువు హత్యగా పోలీసులు భావిస్తున్నారు.

నాగరాజు హత్యతో అక్కడి స్థానికులు ఆందోళనకు దిగారు. మహిళలు, హిందువులకు రక్షణలేందంటూ రోడ్డుపై నిరసన తెలిపారు. బాధితురాలికి న్యాయం చేయాలని.. హంతకులను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. పోలీసులు సర్థిచెప్పడంతో ఆందోళన విరమించారు.

Tags

Read MoreRead Less
Next Story