శారీరకంగా వాడుకొని మోసం చేశాడు.. పెళ్లి చేయాలని మానవ హక్కుల కమిషన్‌ను..!

శారీరకంగా వాడుకొని మోసం చేశాడు.. పెళ్లి చేయాలని మానవ హక్కుల కమిషన్‌ను..!
ప్రేమించిన యువకుడితో వివాహం జరిపించాలని.. లేదంటే కారుణ్య మరణానికి అనుమతివ్వాలని ఓ యువతి మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది

ప్రేమించిన యువకుడితో వివాహం జరిపించాలని.. లేదంటే కారుణ్య మరణానికి అనుమతివ్వాలని ఓ యువతి మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. వనపర్తి జిల్లా అజ్జకొల్లు గ్రామానికి చెందిన కురుమూర్తి.. అదే గ్రామానికి చెందిన పూనమ్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే పెద్దల ఒత్తిడితో పెళ్లి చేసుకోనని... శారీరకంగా వాడుకొని మోసం చేశాడని యువతి వాపోతుంది. పోలీసులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా.. న్యాయం చేయలేదని చెప్తోంది. మరోవైపు ఫిర్యాదు స్వీకరించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్.. నవంబర్ 15 లోపు సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని వనపర్తి జిల్లా ఎస్పీని ఆదేశించింది.

Tags

Read MoreRead Less
Next Story