Chennai: యూఎస్ నుండి వచ్చిన కాసేపటికే విషాదం.. నమ్మినవారే అలా..

Chennai: యూఎస్ నుండి వచ్చిన కాసేపటికే విషాదం.. నమ్మినవారే అలా..
Chennai: ఇండియాకు వచ్చేసిన తర్వాత తల్లిదండ్రులతో మాట్లాడడానికి తన కూతురు ఎన్నిసార్లు ఫోన్ చేసినా వారు స్పందించలేదు.

Chennai: నమ్మిన వ్యక్తులే మనల్ని మోసం చేయగలరు అని ఇప్పటికే ఎంతోమందికి అనుభవం అయ్యే ఉంటుంది. ఎక్కువ నమ్మిన వారి చేతిలోనే మోసపోయిన వారు ఎందరో.. తాజాగా చెన్నైలో కూడా అలాంటి ఓ ఘటనే జరిగింది. ఓ వృద్ధ దంపతులు అమెరికా నుండి తిరిగొచ్చిన కాసేపట్లోనే ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.

శ్రీకాంత్ (60), అనురాధ (53) దంపతులు. వీరిద్దరు చెన్నైలో నివాసముండేవారు. అయితే వీరి కూతురు అమెరికాలో సెటిల్ అవ్వడంతో కొన్నాళ్లుగా వీరు కూడా అక్కడే ఉంటున్నారు. ఇటీవల వీరిద్దరు తిరిగి చెన్నైలోని వీరి ఫార్మ్ హౌస్‌కు వచ్చారు. ఇండియాకు వచ్చేసిన తర్వాత తల్లిదండ్రులతో మాట్లాడడానికి తన కూతురు ఎన్నిసార్లు ఫోన్ చేసినా వారు స్పందించలేదు. దీంతో తనకు అనుమానం వచ్చి స్థానిక పోలీసులకు సమాచారం అందించింది.

పోలీసులు, బంధువులు వచ్చి చూడగా ఆ ఫార్మ్ హౌస్ అంతా ఖాళీగా ఉండడంతో పాటు సామాన్లు చల్లాచదురుగా పడి ఉన్నాయి. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి విచారణ చేపట్టగా.. ఆ ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్న కృష్ణన్, రవి.. శ్రీకాంత్, అనురాధను హత్య చేశారని తెలిసింది. అంతే కాకుండా వారిద్దరు శవాలను ఆ ఫార్మ్ హౌస్‌లోనే పాతిపెట్టేసి బీరువాలోని దాదాపు రూ.5 కోట్ల నగదుతో పాటు నగలు కూడా తీసుకొని పారిపోయారని తెలిసింది. కృష్ణన్, రవిలను పట్టుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story