వ్యాపారవేత్త శిల్పా చౌదరికి రిమాండ్
By - TV5 Digital Team |13 Dec 2021 10:34 AM GMT
ప్రముఖులను మోసగించినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యాపారవేత్త శిల్పా చౌదరికి రిమాండ్ విధించింది రాజేంద్రనగర్ లోని ఉప్పర్ పల్లి కోర్టు. ఆమె బెయిల్ పిటిషన్ ను కూడా కొట్టేసింది.
ప్రముఖులను మోసగించినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యాపారవేత్త శిల్పా చౌదరికి రిమాండ్ విధించింది రాజేంద్రనగర్ లోని ఉప్పర్ పల్లి కోర్టు. ఆమె బెయిల్ పిటిషన్ ను కూడా కొట్టేసింది. దీంతో శిల్పను మళ్లీ చంచల్ గూడ మహిళా జైలుకు తరలించారు పోలీసులు. శిల్ప కస్టడీని రెండు రోజుల పాటు పొడిగించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు నార్సింగి పోలీసులు. మూడు రోజుల కస్టడీ లో శని, ఆదివారం రావడంతో బ్యాంక్ లావాదేవీలు చేయలేక పోయామని పిటిషన్ లో పేర్కొన్నారు పోలీసులు. బ్యాంక్ లావాదేవీలే కీలకమని న్యాయమూర్తికి వివరించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఒక్కరోజు కస్టడీకి అనుమతిచ్చింది. దీంతో రేపు ఉదయం మరోసారి శిల్పను కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com