Jharkhand : వ్యభిచారానికి ఒప్పుకోలేదని సొంత చెల్లిని చంపేసిన అక్క..!

Jharkhand :  వ్యభిచారానికి ఒప్పుకోలేదని సొంత చెల్లిని చంపేసిన అక్క..!
Jharkhand : ఏడు నెలల క్రితం అదృశ్యమైన 17 ఏళ్ల బాలిక మృతదేహం జార్ఖండ్‌లోని సోనార్ డ్యామ్ సమీపంలో లభ్యమైంది. మేజిస్ట్రేట్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు.

Jharkhand : ఏడు నెలల క్రితం అదృశ్యమైన 17 ఏళ్ల బాలిక మృతదేహం జార్ఖండ్‌లోని సోనార్ డ్యామ్ సమీపంలో లభ్యమైంది. మేజిస్ట్రేట్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు. అయితే ఆ బాలికను ఆమె తోడబుట్టిన వారే హత్యచేసినట్లుగా పోలీసులు గుర్తించారు. రాఖీ దేవి (30) మరియు రూప దేవి (25), బావ ధనంజయ్ అగర్వాల్ (30) ప్రతాప్ కుమార్ సింగ్, నితీష్ కలిసి హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు.

నితీష్ మినహా మిగతా నిందితులను అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం ఐదుగురు అక్కాచెల్లెల్లో ఈ బాలిక నాలుగో అమ్మాయి.. తల్లిదండ్రులు మరణించడంతో ఆమె రాఖీతో కలిసి ఉంటుంది. రాఖీ వ్యభిచారం నిర్వహిస్తుంది. రాఖీ, ధనంజయ్... మృతురాలిని కూడా బలవంతంగా వ్యభిచారంలోకి దింపారు.

అయితే ఆ బాలిక మరో అబ్బాయిని ప్రేమిస్తోంది. ఇదే విషయాన్ని ఇంట్లో వారికి చెప్పడంతో వారు వ్యతిరేకించారు. దీనిపైన పలుమార్లు వారి మధ్య గొడవలు జరుగుతుండేవి. అయితే ఆమె పైన కన్నేసిన ప్రతాప్ ప్లాన్‌ ప్రకారం బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

అనంతరం ఆమెను ఉరితీశాడు. ఇదే విషయాన్ని రాఖీ, రూప, ధ‌నంజ‌య్‌ల‌కు తెలియజేయగా వారందరూ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. అంత్యక్రియలకు తీసుకెళ్లే ముందు రూప ఇంట్లో మృతురాలి బట్టలు మార్చారు..ఆ తర్వాత పాతిపెట్టారు.

Tags

Read MoreRead Less
Next Story