Bangalore: విధి ఆడిన వింత నాటకం.. ప్రేమికుడు యాక్సిడెంట్ లో.. ప్రియురాలు..

Bangalore: విధి ఆడిన వింత నాటకం.. ప్రేమికుడు యాక్సిడెంట్ లో.. ప్రియురాలు..
Bangalore: మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తాడు.. ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుందామనుకున్నారు.. కానీ వారి పెళ్లిని పెద్దలు అంగీకరించలేదు..

Bangalore: మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తాడు.. ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుందామనుకున్నారు.. కానీ వారి పెళ్లిని పెద్దలు అంగీకరించలేదు.. అబ్బాయికి మరో అమ్మాయితో పెళ్లి చేయడానికి సిద్దమయ్యారు.. పెద్దలను ఎదిరించి పారి పోయి పెళ్లి చేసుకుందామనుకోలేదు. అందుకే ఇరుకుటుంబాల వారిని ఒప్పించారు. పెళ్లికి ముహూర్తం కూడా నిర్ణయించారు.. అంతలోనే విధికి కన్నుకుట్టింది. ఇద్దరూ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

తుమకూరు తాలూకా ముస్కల్‌ గ్రామానికి చెందిన 23 ఏళ్ల ధనుష్‌ సొంతంగా బట్టల షాపు పెట్టుకున్నాడు. అరేహళ్లి గ్రామానికి చెందిన 22 ఏళ్ల సుష్మ తో ప్రేమలో పడ్డాడు. రెండేళ్లనుంచి ప్రేమికులుగా ఉన్న వారిద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు. అతను ఆమెను అన్నింటికంటే ఎక్కువగా ప్రేమించాడు. కానీ వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. అయినా ఇరుకుటుంబాలను ఒప్పించారు. పెళ్లి చేద్దామనుకున్నారు పెద్దలు. ఇంతలో ధనుష్ గ్రామంలో జాతర ఉందని వెళ్ళాడు. తిరిగి వస్తున్న క్రమంలో రోడ్ యాక్సిడెంట్ లో మరణించాడు..

అతడి అంత్యక్రియలకు వెళ్లిన సుష్మ మనస్తాపానికి గురయ్యింది. అదే క్రమంలో నిన్న రాత్రి సుష్మ విషం తాగింది. కుటుంబసభ్యులు విషయం తెలుసుకుని హుటాహుటిని ఆస్పత్రికి తరలించారు.. అయినా ఉపయోగం లేకుండా పోయింది. చికిత్సపొందుతూ సుష్మ ప్రాణాలు కోల్పోయింది. ప్రేమికుల జీవితం విషాదంగా ముగిసింది.

Tags

Read MoreRead Less
Next Story