crime: మనవడి పెళ్లి అమ్మమ్మ చావుకొచ్చింది.. వచ్చిన సంబంధాలన్నీ తిరస్కరిస్తుందని..
Crime : తనకు వచ్చిన సంబంధాలన్నీ అమ్మమ్మ తిరస్కరిస్తుందని కోపంతో మనవడు ఆమెను కర్రతో కొట్టి చంపేశాడు. మనవడు వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.. కానీ అతని అమ్మమ్మ మాత్రం వచ్చిన సంబంధాలన్నీ ఏదో వంక పెట్టి తిరస్కరిస్తూ వస్తోంది. దీంతో మనవడికి అమ్మమ్మ మీద కోపం కట్టలు తెంచుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని షోలాపూర్లో వెలుగుచూసింది.
ఆమెను చంపిన తరువాత నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి తాను చేసిన నేరాన్ని వివరించాడు.. పోలీసుల ఎదుట లొంగిపోయాడు. షోలాపూర్లోని జోద్భావి పేట్లోని ఆదర్శ్ సొసైటీలో ఈ ఘటన ఊరంతా పాకింది. విన్నవారంతా ఆశ్చర్యపోయారు. ఈ ఘటన తర్వాత 25 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు.
చనిపోయిన మల్నబీ హసన్ నదాఫ్, ఆదర్శ్ నగర్ నివాసి, వివాహం కోసం కర్ణాటక నుండి తన మనవడు సలీం నదాఫ్ను ఇంటికి పిలిచినట్లు విచారణలో తేలింది. నదాఫ్ కోసం వచ్చిన సంబంధాలలో, అతడిని కూడా కొంతమంది అమ్మాయిలు ఇష్టపడ్డారు. కానీ అతని అమ్మమ్మ ఆ సంబంధాలన్నింటినీ తిరస్కరించింది.
పెళ్లికి అమ్మమ్మ ఒప్పుకోదని సలీం భావించాడు. దీంతో కోపోద్రిక్తుడైన నదాఫ్ సోమవారం తన అమ్మమ్మతో గొడవ పడ్డాడు. అది కాస్తా పెద్దదవడంతో మనవడు.. అమ్మమ్మపై కర్రతో దాడి చేశాడు. ఆమె ఊపిరి ఆగిపోయేంత వరకు కొడుతూనే ఉన్నాడు.
ఆమెను చంపే సమయంలో, నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోనివ్వట్లేదు అని అంటూనే ఉన్నాడు. నాకు పెళ్లి చేయడం నీకు ఇష్టం లేకపోతే ఎందుకు నన్ను కర్ణాటక నుంచి ఇక్కడికి పిలిపించావు అని ఆగ్రహంతో ఆమెను కొట్టి కొట్టి చంపేశాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగపోయాడు.. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com