కాలువలోకి దూకిన ఇంజనీర్ కుటుంబం.. భార్య, కుమార్తె మృతి..

కాలువలోకి దూకిన ఇంజనీర్ కుటుంబం.. భార్య, కుమార్తె మృతి..
గురువారం సాయింత్రం కారులో గుబ్బి తాలూకాలోని నిట్టూరు సమీపంలో ఉన్న సాగరనహళ్లి గేట్ వద్దకు చేరుకున్నారు.

కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు.. భార్య, కూతురు మృతదేహాలు బయటపడ్డాయి. ఇంజనీర్ మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన కర్ణాటక తుమకూరు జిల్లాలోని గుబ్బి తాలూకా సాగరహళ్లి గేట్ వద్ద చోటు చేసుకుంది. కే.బీ క్రాస్ హేమావతి కాలువ కార్యాలయంలో సహాయ ఇంజనీర్‌గా పనిచేస్తున్న రమేష్ (55) తుమకూరు నగరంలోని రింగ్ రోడ్డులో నివసిస్తున్నారు.

ఆయనకు భార్య మమత (46), కుమార్తె శుభ (25) ఉన్నారు. గురువారం సాయింత్రం కారులో గుబ్బి తాలూకాలోని నిట్టూరు సమీపంలో ఉన్న సాగరనహళ్లి గేట్ వద్దకు చేరుకున్నారు. అక్కడే కారు నిలిపి ముగ్గురూ హేమావతి కాలువలో దూకారు.

రాత్రి 8.30 గంటల సమయంలో ఇద్దరి మృతదేహాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మతులను మమత, శుభగా గుర్తించిన పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రమేష్ కూడా కాలువలోకి దూకిన విషయం తెలుసుకుని గాలింపు చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story