Karnataka Family Murder: ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురి హత్య.. అదేనా కారణం..?

Karnataka Family Murder: ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురి హత్య.. అదేనా కారణం..?
Karnataka Family Murder: కర్ణాటకలో మండ్య జిల్లాలో ఉండే ఒకే కుటుంబానికి చెందిన దారుణంగా హత్య చేశారు దుండగులు.

Karnataka Family Murder: ఈమధ్య కుటుంబ హత్యలు, కుటుంబ ఆత్మహత్యల కేసులు పెరిగిపోయాయి. చిన్న చిన్న విషయాల వల్ల, విచక్షణ లేని కోపంతో హత్యల వరకు వెళ్తున్నారు. పైగా దొంగలు కూడా హత్యలు చేసే వరకు వెళ్తున్నారు. తాజాగా కర్ణాటకలో దొంగతనం కోసం వచ్చి ఏకంగా కుటుంబంలోని అయిదుగురిని హత్య చేశారు దుండగులు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

కర్ణాటకలో మండ్య జిల్లా శ్రీరంగపట్టణ కె.ఆర్‌.ఎస్‌. గ్రామంలో ఉండే ఒకే కుటుంబానికి చెందిన లక్ష్మి(30), రాజ్‌(12), కూసమల్‌(7), కునాల్‌(5), గోవింద్‌(12)ను శనివారం రాత్రి దారుణంగా హత్య చేశారు దుండగులు. దీని కోసం వారు మారణాయుధాలు ఉపయోగించారని పోలిసులు తెలిపారు.

హత్య చేసిన తర్వాత దుండగులు ఇంట్లోని బంగారం, నగదు తీసుకొని పరారైనట్టు పోలీసులు గుర్తించారు. అయితే హత్యలకు కేవలం దొంగతనమే కారణమా..? లేక మరే ఇతర కారణాలైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తును మొదలుపెట్టారు. అయితే మృతురాలు లక్ష్మి భర్త వ్యాపార నిమిత్తం బయట ఊళ్లకు వెళ్లినట్టు వారు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story