Maharashtra Encounter: పోలీసులు, మావోల మధ్య ఎదురుకాల్పులు.. నలుగురు మావోలు మృతి..

Maharashtra Encounter: పోలీసులు, మావోల మధ్య ఎదురుకాల్పులు.. నలుగురు మావోలు మృతి..
Maharashtra Encounter: మహరాష్ట్ర గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది.

Maharashtra Encounter: మహరాష్ట్ర గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. పోలీసులకు , మావోలకు జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతిచెందారు. గ్యారబట్టి అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగినట్లు వెల్లడించారు. ఈనేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.

కనీసం నలుగురు మావోయిస్టులు ఈ కాల్పుల్లో మృతిచెంది ఉంటారని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ముంబాయికి 920 కిలోమీటర్ల దూరంలో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ కాల్పులు మొదలయ్యాయని ఆయన అన్నారు. ముందుగా మావోలే పోలీసులపై కాల్పులకు ఎగబడినట్లుగా తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story