Kadapa : సీఎం జగన్ సొంత జిల్లాలో దారుణం.. ఎస్సీ బాలికపై సామూహిక అత్యాచారం
Kadapa : సీఎం జగన్ సొంత జిల్లాలో దారుణం జరిగింది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఎస్సీ బాలికపై గత కొంత కాలంగా ఓ యువకుడు, అతని స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. స్థానికుల ఫిర్యాదుతో బాలికను విచారించిన పోలీసులు...సమాచారం అందుకున్నారు. ఇటీవల కూలగొట్టిన మార్కెట్ నుంచి బాలికను తీసుకెళ్లి...సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
చెంబు అనే యువకుడితో పాటు అతని స్నేహితులు అత్యాచారం చేసినట్లు పోలీసులకు తెలిపింది బాలిక. ఐతే విషయం తెలుసుకున్న పోలీసులు విషయం బయటకు పొక్కకుండా బాలికను మరో చోటుకు తరలించారు. అక్కడ నుంచి అమృతనగర్కు ఆటోలో పంపారు. అక్కడ బాలిక బయట తిరుగుతండడాన్ని చూసిన స్థానిక పోలీసులు...మైలవరంలోని ఓ ప్రైవేట్ హోంకు షిఫ్ట్ చేశారు. ఐతే అత్యాచారానికి గురైన బాలికకు న్యాయం చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com