అక్క అత్యాచారం కేసు కోసం వెళ్లి చెల్లిని గర్భవతిని చేసిన కానిస్టేబుల్..!

అక్క అత్యాచారం కేసు కోసం వెళ్లి చెల్లిని గర్భవతిని చేసిన కానిస్టేబుల్..!
అక్క అత్యాచారం కేసు పై విచారణకి వెళ్లిన ఓ కానిస్టేబుల్ ఆమె చెల్లిని గర్భవతిని చేసిన ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో చోటు చేసుకుంది.

అక్క అత్యాచారం కేసు పై విచారణకి వెళ్లిన ఓ కానిస్టేబుల్ ఆమె చెల్లిని గర్భవతిని చేసిన ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. బాధితురాలు తండ్రి చెప్పిన వివరాల ప్రకారం.. తన పెద్ద కుమార్తె అత్యాచారానికి గురైందని.. ఇదే కేసు పైన సమన్లు, ఇతర కోర్టు పేపర్‌లను ఇచ్చేందుకు కానిస్టేబుల్‌ శివరాజ్‌ నాయక్‌ తమ ఇంటికి వచ్చేవాడని తెలిపాడు. అయితే కోర్టు ప్రొసీడింగ్‌లు పూర్తయిన తర్వాత కూడా ఏదోక వంకతో ఇంటికి వచ్చేవాడు.. ఈ క్రమంలో ఆ ఇంట్లో ఉంటున్న మైనర్ బాలిక పైన కన్నేశాడు. ఆమెకి ప్రేమ, పెళ్లి అంటూ మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఆమె పైన పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చింది. ఆమెలో మార్పులు రావడం గమనించిన ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది. దీనితో కానిస్టేబుల్‌‌ని నిలదీశారు. పెళ్లి చేసుకోవాలని కోరారు. అందుకు నిరాకరించిన అతను.. అబార్షన్ చేసుకోవాలంటూ రూ.35,000 ఇచ్చాడు. దీంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్‌ శివరాజ్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story