భర్త కళ్ళముందే భార్య పైన ముగ్గరు అత్యాచారం..!
By - Gunnesh UV |12 Aug 2021 10:15 AM GMT
భర్త ముందే భార్య పైన ముగ్గరు అత్యాచారం చేసిన ఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది.
భర్త ముందే భార్య పైన ముగ్గరు అత్యాచారం చేసిన ఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ బాడ్మెర్కు చెందిన దంపతులు మంగళవారం బలోత్రాకు బైక్ మీద బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో వీరిని నలుగురు అడ్డుకున్నారు. ఇందులో ఒకరు బాధితురాలి భర్త బైక్ ని తీసుకొని వెళ్ళగా మిగిలిన ముగ్గురు ఆమె భర్తను తీవ్రంగా కొట్టారు. అనంతరం వారిని ఓ కారులో తీసుకెళ్ళారు. కారులో ఆ ముగ్గురూ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. ముగ్గురు నిందితులైన కమ్తాయ్, బాబులాల్, నరేష్లను అరెస్టు చేసినట్లు బాడ్మెర్ పోలీసు సూపరింటెండెంట్ ఆనంద్ శర్మ తెలిపారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com