Medak: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లిదండ్రులతో సహా చిన్నారి మృతి..
Medak: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జహీరాబాద్ మండలం డిడిగి వద్ద కారు - ద్విచక్ర వాహనం ఢీకొని నలుగురు మృతి చెందారు. అదుపుతప్పి పల్టీలు కొడుతూ వచ్చిన కారు.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ఉన్న భార్యాభర్తలు, 8 నెలల చిన్నారి మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి మరణించాడు.
మృతి చెందిన భార్యాభర్తలు బాలరాజు, శ్రావణి, 8 నెలల చిన్నారి అమ్ములుగా గుర్తించారు. వీరి స్వస్థలం అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లి అని పోలీసులు తెలిపారు. కారులో ప్రయాణిస్తూ మృతి చెందిన వ్యక్తి వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పట్లూర్కు చెందిన మహ్మద్ ఫరీద్గా గుర్తించారు. మృతదేహాలను జహీరాబాద్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం ధాటికి మంటలు చెలరేగి ద్విచక్రవాహనం దగ్ధమైంది.c
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com