దారుణం : టోల్‌ క్యాబిన్‌పై రాడ్లతో దాడికి దిగిన దుండగులు

దారుణం : టోల్‌ క్యాబిన్‌పై రాడ్లతో దాడికి దిగిన దుండగులు

ఉత్తరప్రదేశ్‌ ముజఫర్‌నగర్‌లో కొందరు దుండగులు వీరంగం సృష్టించారు. ముజఫర్‌నగర్‌-సహరాన్‌పూర్‌ టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. టోల్‌ క్యాబిన్‌పై రాడ్లతో దాడికి దిగి బీభత్సం సృష్టించారు. సిబ్బందితో పాటు వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. దాడి దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. టోల్‌ ఫీజు చెల్లింపు విషయంలో తలెత్తిన వివాదమే దాడికి కారణంగా తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story