మద్యం మత్తులో గొంతు, చేతులు కోసుకొన్న యువకుడు
By - TV5 Telugu |31 May 2019 1:22 PM GMT
మద్యం మత్తులో ఓ యువకుడు గొంతు, చేతులు కోసుకొన్నాడు. అంతటితో అగకుండా రోడ్డుపై హాల్చల్ చేశాడు. స్థానికుల సమాచారంలో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతనిని 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గొంతు కోసుకోవడంతో యువకుడు సాయికిరణ్ పరిస్థితి విషమంగా ఉంది. ఈఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం, రామాంజనేయకాలనీలో చోటు చేసుకుంది. గతంలో కూడా అనేక సార్లు.. కాళ్లు, చేతులు కోసుకొని చనిపోతానని బెదిరించేవాడని స్థానికులు తెలిపారు.
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com