Mahashivaratri 2021 : మహాశివరాత్రి వెనుక ఉన్న కథ ఇదే..!

Mahashivaratri 2021 : మహాశివరాత్రి వెనుక ఉన్న కథ ఇదే..!
హిందువులకి అత్యంత పవిత్రమైన పండగలలో మహాశివరాత్రి ఒకటి.. మహాశివరాత్రి చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం యొక్క కృష్ణ పక్ష చతుర్దశి రోజున వస్తుంది.

హిందువులకి అత్యంత పవిత్రమైన పండగలలో మహాశివరాత్రి ఒకటి.. మహాశివరాత్రి చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం యొక్క కృష్ణ పక్ష చతుర్దశి రోజున వస్తుంది. హిందువుల క్యాలెండర్ నెలలో ఫాల్గుణ మాసము యొక్క కృష్ణ పక్ష చతుర్దశి. సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావింపబడుతుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణం చెపుతుంది.

ఈ రోజున భక్తులు తెల్లవారుజామున లేచి, స్నానం చేసి అత్యంత భక్తీ శ్రద్దలతో శివుడిని కొలుస్తారు.. ప్రధానంగా ఈ రోజంతా ఉపవాసం, రాత్రంతా జాగరణ చేసారు. ఇది శివభక్తులకు అత్యంత పర్వదినంగా చెప్పుకోవచ్చు.. రాత్రంతా శివ పూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీలా కథాపారాయణలు జరుపుతారు. అన్ని శైవక్షేత్రాలలో మహాశివరాత్రి వేడుకలు చాలా గొప్పగా జరుగుతాయి.

మహాశివరాత్రి వెనుక ఉన్న కథ;

ప్రతి పండగ వెనుక ఏదోక రహస్యం ఉన్నట్టుగా మహాశివరాత్రి వెనుక కూడా చాలా కథలున్నాయి.. అందులో ఒకటి ఈ కథ... ఈ కథ శివపురాణం నుంచి తీసుకోబడింది. ఒకప్పుడు ప్రళయ కాలం సంప్రాప్త కాగా బ్రహ్మ, విష్ణువులు ఒకరి కంటే ఒకరం గొప్ప అని ఒకరితో ఒకరు యుద్ధానికి దిగారు. ఆ సమయంలోనే వారి మధ్య లింగ స్వరూపం అగ్నిస్థంబంగా ఆవిర్భవిస్తుంది. అయితే ఆ అగ్నిస్థంబం మొదలు, చివర ఎక్కడున్నాయో ఎవరికీ తెలియకుండా పోయింది.

దీని మొదలు లేదా చివరను ఎవరైతే తెలుసుకొని చెబుతారో వారే గొప్ప అని ఆ లింగ స్వరూపం చెపుతుంది. దీంతో వెంటనే విష్ణువు తన పదవతారాలలో ఒకటైనా వరాహావతారంలో కిందున్న పాతాళలోకంలోకి వెళ్తాడు. ఇక బ్రహ్మ హంస వాహనంతో ఆకాశం వైపు వెళ్ళాడు. ఎంత వెళ్ళినా విష్ణువుకి మొదలు దొరకకపోవడంతో తిరిగివచ్చేశాడు. ఇక బ్రహ్మ మాత్రం తానూ చూశానని.. దానికి సాక్ష్యం కామధేనువు, మొగలి పువ్వు అని చెబుతాడు.

జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడై... మోసము చేసిన బ్రహ్మను శిక్షించడంకోసం శివుడు అగ్ని లింగ స్వరూపం నుండి సాకారమైన శివుడిగా ప్రత్యక్షం అవుతాడు. విష్ణువు సత్యవాక్యానికి సంతసించి ఇకనుండి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకొంటాడని, విష్ణువుకి ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదిస్తాడు. ఇక కామధేనువు, మొగిలిపువ్వు అబద్దం చెప్పాయని బ్రహ్మపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

మొగిలిపువ్వును పూజకు అర్హతలేనిదిగా శపించగా, తెల్లవారి లేచి ఆవు ముఖం చూడటం కుడా పాప కారణం అని శపించాడు. ఆవు అభ్యర్దన మేరకు తోకతో నిజం చెప్పింది కాబట్టి వృష్టభాగం పవిత్రమైనది, తోక భాగాన్ని పూజించిన వారికీ పుణ్య ఫలాలు కలుగుతాయని వరాన్ని అనుగ్రహించాడు. ఆనాటి అర్ధరాత్రిని లింగోద్భవకాలంగా భావించి, మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story