పరమశివుడు.. పార్వతీ దేవికి బోధించిన పవిత్ర శివరాత్రి కథ..!

పరమశివుడు.. పార్వతీ దేవికి బోధించిన పవిత్ర శివరాత్రి కథ..!
సాక్షాత్తు ఆ పరమశివుడు సాక్షాత్కరించి తమను అనుగ్రహిస్తాడని భక్తులు నమ్ముతారు. మరి ఈ శివరాత్రి యొక్క విశిష్టతను ఆ పరమేశ్వరుడే ఓ కథ రూపంలో పార్వతి దేవికి వివరిస్తాడు.

పరమ శివుని భక్తులకు శివరాత్రి ఎంతో ప్రీతి పాత్రమైనది.. ఆరోజు ఉదయం నుంచి భక్తులు శివారాధనలో మునిగిపోతారు. ఉపవాసం ఉండి, రాత్రి అంతా జాగారం చేసి శివనామస్మరణ చేస్తుంటారు. సాక్షాత్తు ఆ పరమశివుడు సాక్షాత్కరించి తమను అనుగ్రహిస్తాడని భక్తులు నమ్ముతారు. మరి ఈ శివరాత్రి యొక్క విశిష్టతను ఆ పరమేశ్వరుడే ఓ కథ రూపంలో పార్వతి దేవికి వివరిస్తాడు.

పూర్వం ఓ బోయవాడు ఉండేవాడు.. ప్రతి రోజు అడవికి వెళ్లి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకునే వాడు. అలా వెళ్లిన అతడికి ఓ రోజు ఒక్క మృగం కూడా దొరకలేదు. దాంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. మార్గమధ్యలో ఓ సరస్సు కనిపించింది. అక్కడికి ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి వస్తుందేమో అప్పుడు వేటాడవచ్చని ఆశపడ్డాడు. సమీపంలోని ఓ చెట్టు ఎక్కి కూర్చుని చూశాడు. అతడికి శివ శివ అని నామస్మరణ చేయడం అలవాటు.. అదే విధంగా అంటూ చెట్టుకి ఉన్న ఒక్కో ఆకు తెంపుతూ కిందకు వేస్తున్నాడు.

ఇంతలో ఓ ఆడ జింక అటుగా వచ్చింది. దాంతో అతడికి ప్రాణం లేచి వచ్చింది. వెంటనే దానిపైకి బాణం ఎక్కుపెట్టాడు. అప్పుడు ఆ జింక అచ్చంగా మనిషి మాదిరిగానే వేటగాడితో తనను సంహరించవద్దని వేడుకుంది. ప్రాణభిక్ష పెట్టమంటూ ప్రాధేయపడింది. దాంతో అతడి మనసు కరిగిపోయింది. దాన్ని వదిలేశాడు. మరో జంతువు రాకపోతుందా అని అక్కడే కూర్చుని చూశాడు. అలా రెండో జాము కూడా గడిచిపోయింది.

ఇంతలో మరో ఆడ జింక అటుగా వచ్చింది. దాన్ని సంహరించాలనుకున్నాడు. కానీ అది కూడా తాను బక్కగా ఉన్నానని, తన మాంసం మీ కుటుంబానికి సరిపోదని, విడిచి పెట్టమంటూ ప్రాధేయపడింది. ఏ జంతువు దొరక్కపోతే తానే వస్తానని వేడుకుంది. మొదటి జంతువు మాదిరిగానే రెండు జంతువు కూడా మాట్లాడేసరికి దాన్ని కూడా వదిలిపెట్టేసాడు. మూడో జంతువు కోసం ఎదురు చూశాడు.

అలాగే మూడో జాము కూడా గడిచి పోయింది. నీరసంగా ఉన్న అతడికి ఓ మగ జింక కనిపించింది. దాన్ని సంహరిద్దామనుకునే సరికి అది కూడా మానవభాషలో మాట్లాడింది. బాణం వేయబోయే సమయానికి మొదటి రెండు జింకల మాదిరే మాట్లాడింది. ఇంతలో నాలుగో జాము గడిచి సూర్యోదయమైంది. ఇంతలో మరోక జింక దాని పిల్ల అటుగా రావడం గమనించాడు.

అయితే విల్లెక్కుపెట్టిన బోయవాడితో ఆ జింక మాట్లాడుతూ... తన పిల్లను ఇంటి వద్ద విడిచి వస్తానని అప్పటివరకు ఆగమని చెప్పి వెళ్లింది. అ తరవాత మరికొద్ది సేపటికి నాలుగు జింకలు బోయవాడికిచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడ్డాయి. ఆ జింకల సత్ప్రవర్తన ఆ వేటగాడిలో మార్పు తీసుకొచ్చింది.

ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం, అతడికి తెలియకుండానే శివ నామస్మరణం చేయడం, తన చూపునకు అడ్డువచ్చిన మారేడు ఆకులు కోసి కిందపడేటం చేశాడు. ఆ చెట్టుకిందనే ఓ పాత శివలింగం ఉండటం వల్ల ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి. దీంతో మారేడు దళ పూజా ఫలితాన్నిచ్చింది. నాలుగో జాము వరకు మెలకువతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం వచ్చింది.

క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్యకార్యాల వల్ల అతడి మనస్సు నిర్మలమైంది. పైగా జింకల సత్యనిష్ఠ అతడిని పూర్తిగా మార్చి వేసింది. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజా ఫలం వల్ల అతడు హింసను విడనాడు. జింకలు తమ సత్యనిష్ఠతో పరమేశ్వర అనుగ్రహం పొంది మృగశిర నక్షత్రంగా మారాయి. వేటగాడు ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు. హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనస్సు దాని నుంచి మరలుతుంది. జింకలను చంపడంలో కాలయాపన చేసి బోయవాడు చివరకు అహింసావాదిగా మారగలిగాడు.

Tags

Read MoreRead Less
Next Story