Tirumala Laddu : శ్రీవారి లడ్డుకి ఎన్నో ప్రత్యేకతలు.. ఇందులో ఎన్నిరకాల వస్తువులను వాడతారో తెలుసా?

Tirumala Laddu : శ్రీవారి లడ్డుకి ఎన్నో ప్రత్యేకతలు.. ఇందులో ఎన్నిరకాల వస్తువులను వాడతారో తెలుసా?
Tirumala Laddu : తిరుమల తిరుపతిలోని శ్రీవారి లడ్డుకి ప్రపంచవ్యాప్తంగా పేరుంది. తిరుమలలోని మూలమూర్తికి సమర్పించే ప్రసాదాలను ఆగమశాస్త్రం ప్రకారం సమర్పిస్తారు.

Tirumala Laddu : తిరుమల తిరుపతిలోని శ్రీవారి లడ్డుకి ప్రపంచవ్యాప్తంగా పేరుంది. తిరుమలలోని మూలమూర్తికి సమర్పించే ప్రసాదాలను ఆగమశాస్త్రం ప్రకారం సమర్పిస్తారు. శ్రీవారికి సమర్పించే నైవేద్యాలలో మనకి తెలిసిన లడ్డు మాత్రమే కాడుండా 50 రకాల ప్రసాదాలను స్వామివారికి సమర్పిస్తారు. ఆగమశాస్త్రం ఆ శ్రీనివాసునికి నిత్యం అందించే ప్రసాదాల గురించి వివరించింది. ఆ 50 రకాల ప్రసాదల్లోను ఎన్నో ప్రత్యేకతలున్నాయి. వాటిలో.. సుప్రభాత సమయంలో నవనీతం, గోక్షీరంతో తయారుచేసిన పదార్థాలను స్వామివారికి నివేదిస్తారు.

తోమాల పూర్తి అయిన తరువాత నల్లనువ్వులు, బెల్లం, శొంఠిని ప్రసాదంగా సమర్పిస్తారు. సహస్రనామార్చన తరువాత మీగడ, వెన్న, పెరుగుతో తయారుచేసిన అన్నాన్ని నివేదిస్తారు. మధ్యాహ్నం ఆరాధనలో నాదుకం, లడ్డు, దోసె, వడ, అప్పం నైవేద్యంగా అందిస్తారు. సాయంకాలం అష్టోత్తర శతనామార్చన తరువాత శుద్ధన్నం, సీరా.. రాత్రి నైవేద్య సమయంలో మిరియాలతో తయారుచేసిన మరీచ్చాన్నం, ఉడాన్నం.. రాత్రి ఆరాధన తరవాత విశ్రాంతి సమయంలో పాయసాన్ని స్వామికి నైవేద్యంగా ఉంచుతారు.

మూడువందల యాభై ఏళ్ళ క్రితం కేవలం బియ్యప్పిండితో చేసిన లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు శ్రీవారి ప్రసాదంగా అందించేవారు. బియ్యప్పిండి, బెల్లం కలిపి తయారు చేసిన ఈ లడ్డూలను "మనోహరం" అని పిలిచేవారు. కాని.. శ్రీ వెంకటేశ్వర స్వామికి అందించే అనేక రకాల ప్రసాదాలలో శ్రీవారి లడ్డుకి ఉన్న ప్రాదాన్యత దేనికీ లేదనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. భక్తులు భక్తి శ్రద్ధలతో మహా ఇష్టంగా స్వీకరించే ప్రసాదాల్లో తిరుపతి లడ్డుదే తొలిస్థానం. ఎందుకంటే ఈ లడ్డుకి ఉండే రుచి, మాధుర్యం, సువాసన ప్రపంచంలోనే మరే లడ్డుకి ఉండదు. అందుకే ఈ లడ్డులకు భక్తకోటిలో విశేష ఆధరన ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ లడ్డులకి "జియోగ్రాపికాల్ పేటెంట్" కూడా ఉంది. అంటే శ్రీవారి లడ్డూ తయారి విధానాన్ని మరెవరు అనుకరించడానికి వీలు లేదన్నమాట.

మొదట్లో లడ్డు తయారీలో ఉపయోగించే బూందీని స్వామివారికి ప్రసాదంగా అందిచేవారు. తరువాత కాలంలో ఆ తీపి బూందీనే శ్రీవారి లడ్డూ ప్రసాదంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. శ్రీవారి లడ్డులో వాడే ముడిసరుకులని "దిట్టం" అని పిలుస్తారు. ఈ లడ్డు తయారు చేసే వంటశాలని "పోటు" అని పిలుస్తారు. ఈ పోటుకి ప్రతి రోజు లక్ష లడ్డులని తయారుచేసే సామర్థ్యం ఉంది. పూర్వకాలంలో స్వామివారికి సమర్పించే ప్రసాదాన్ని 'తిరుప్పొంగం" అని పిలిచేవారు. తరువాత కాలంలో సుఖీయం, అప్పం, వడ, అత్తిరసం, మనోహరపడి వంటివి కూడా స్వ్వామివారికి ప్రసాదంలా అందించేవారు. వీటిలో వడ తప్ప మిగతావన్నీ ఎక్కువ రోజులు ఉండేవి కాదు.

అందుకే.. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు వడ పైన ఎక్కువ మక్కువ చూపించేవారు. అది గమనించిన రాష్ట్రప్రభుత్వం తొలిసారిగా 1803లో శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించడం ప్రారంభించింది. ఇలా అనేక రూపాలు మారుతూ వచ్చిన శ్రీవారి ప్రసాదం చివరకు 1940లో తిరుపతి లడ్డుగా స్థిరపడింది. ప్రస్తుతం 2001లో సవరించిన "పడితర దిట్టం" అనుసరిస్తూ శ్రీవారి లడ్డూలను తయారు చేస్తున్నారు. పడి అంటే 51 వస్తువులు అని అర్థం. దీని ప్రకారం.. 5,100 లడ్డూలను తయారుచేయడానికి.. ఆవు నెయ్యి - 165 కిలోలు, శెనగపిండి 180 కిలోలు, చక్కెర - 400 కిలోలు, యాలకలు - 4 కిలోలు, ఎండు ద్రాక్ష - 16 కిలోలు, కలకండ - 8 కిలోలు, ముంతమామిడి పప్పు -30 కిలోలు అవసరం అవుతాయి.

Tags

Read MoreRead Less
Next Story