Tirumala : ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు టీటీడీ వెసులుబాటు..!
By - TV5 Digital Team |12 May 2021 7:23 AM GMT
Tirumala : కరోనా భయంతో భక్తులు తిరుమల వచ్చేందుకు ఇబ్బంది పడుతున్న వేళ టీటీడీ వెసులుబాటు కల్పించింది.
Tirumala : కరోనా భయంతో భక్తులు తిరుమల వచ్చేందుకు ఇబ్బంది పడుతున్న వేళ టీటీడీ వెసులుబాటు కల్పించింది. రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు పొందిన భక్తులకు దర్శనం తేదీని మార్చుకునే అవకాశం ఇచ్చింది. మే 31 వరకు టికెట్లు పొందిన వారు తేదీ మార్చుకోవచ్చని, ఏడాదిలో ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చని సూచించింది. లాక్ డౌన్, కర్ఫ్యూతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పడిపోయింది. రోజుకు 15వేల టికెట్లు అందుబాటులో ఉన్నా స్వామివారి దర్శనానికి 3వేలలోపే వస్తుండటంతో ఈ మార్పు చేసింది. కాగా మంగళవారం 2,262 మంది భక్తులే స్వామివారిని దర్శించుకున్నారని టీటీడీ తెలిపింది. 925 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని వెల్లడించింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com