Coronavirus : మళ్ళీ పెరిగిన కరోనా కేసులు.. 302మంది మృతి..!

Coronavirus : మళ్ళీ పెరిగిన కరోనా కేసులు.. 302మంది మృతి..!
Coronavirus : మళ్ళీ కరోనా పంజా విసురుతోంది ... రోజురోజుకూ కేసులు అధికమవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,17,100 కొత్త కేసులు నమోదయ్యాయి.

Coronavirus : మళ్ళీ కరోనా పంజా విసురుతోంది ... రోజురోజుకూ కేసులు అధికమవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,17,100 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక కరోనాతో పోరాడుతూ మరో 302మంది మృతి చెందారు. దీనితో మృతుల సంఖ్య 4.3,178కి చేరుకుంది. రోజువారీ పాజిటివిటీ రేటు 7.74 శాతానికి చేరింది. ప్రస్తుతం దేశంలో 3.71,363 యాక్టివ్ కేసులున్నాయి. అయితే నిన్న 90 వేల కేసులు రాగా ఇవ్వాళా అదనంగా మరో 27 వేల కేసులు పెరిగాయి. ఇప్పటివరకూ 3.43 కోట్లమంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. రికవరీ రేటు 97.57 శాతానికి పడిపోయింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది. కోవిడ్ కేసులు పెరుగుతున్నందున అనేక రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూ వంటి ఆంక్షలను విధించాయి.


Tags

Read MoreRead Less
Next Story