దేశంలో కొత్తగా 3,68,147 కరోనా కేసులు... 3,417 మంది మృతి..!

దేశంలో కొత్తగా 3,68,147 కరోనా కేసులు... 3,417 మంది మృతి..!
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. రెండు రోజుల క్రితం ఒక్క రోజే 4 లక్షలకు పైగా కేసులు నమోదై సరికొత్త రికార్డు సృష్టించింది.

దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. రెండు రోజుల క్రితం ఒక్క రోజే 4 లక్షలకు పైగా కేసులు నమోదై సరికొత్త రికార్డు సృష్టించింది. అయితే, గత రెండు రోజులుగా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో 3 లక్షల 68 వేల 147 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న మొన్న సెలవులు కాబట్టి.. టెస్టుల సంఖ్య తగ్గి ఉండొచ్చని, దాని వల్లే కేసుల సంఖ్య తగ్గి ఉండొచ్చని భావిస్తున్నారు. కేసుల సంఖ్య తగ్గినా కరోనా మరణాల సంఖ్య మాత్రం తగ్గలేదు. నిన్న ఒక్క రోజే 3వేల 417 మంది బలయ్యారు. ఇప్పటి వరకు కరోనా కారణంగా దేశవ్యాప్తంగా 2 లక్షల 18వేల 959 మంది చనిపోయారు.

Tags

Read MoreRead Less
Next Story