నలుగురు రైల్వే ప్రయాణికులను బలి తీసుకున్న..

నలుగురు రైల్వే ప్రయాణికులను బలి తీసుకున్న..

ఎండవేడిమి నలుగురి ప్రాణాలను బలి తీసుకుంది. రైల్లో ప్రయాణిస్తుండగానే, వేసవి తాపాన్ని తట్టుకోలేక నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. కేరళ ఎక్స్‌ప్రెస్‌లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. మృతులందరూ 65 ఏళ్లు దాటినవారే. వారణాసి, ఆగ్రాలను చూడడానికి వచ్చిన బృందంలో వీళ్లు కూడా ఉన్నారు. ట్రైన్ బయల్దేరిన కాసేపటికే ఎండవేడిమి భయంకరంగా పెరిగిపోయింది. ఆ దెబ్బకు నలుగురు వృద్ధులు అస్వసతకు లోనయ్యారు. ఊపిరాడక తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వైద్యులు వచ్చి సాయం అందించేలోపే కుప్పకూలిపోయారు. మరో ప్రయాణికుడు కూడా తీవ్రంగా అనారోగ్యం పాలవడంతో అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story