దేశవ్యాప్తంగా కొత్తగా 4,01,078 కరోనా కేసులు..4,187 మంది మృతి.. !

దేశవ్యాప్తంగా కొత్తగా 4,01,078 కరోనా కేసులు..4,187 మంది మృతి.. !
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఉదృతి కొనసాగుతుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 18,26,490 మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించగా 4,01,078 మందికి కరోనా కేసులు బయటపడ్డాయి.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఉదృతి కొనసాగుతుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 18,26,490 మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించగా 4,01,078 మందికి కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2.18కోట్లకు చేరింది. అటు కరోనాతో 4,187 మంది మరణించారు. దీంతో మరణాల సంఖ్య 2,38,270కి చేరుకుంది. అటు గడిచిన 24 గంటల్లో 3,18,609 మంది కరోనాను జయించారు. దీంతో రికవరీల సంఖ్య 1.79కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం 37,23,446 యాక్టివ్ కేసులున్నాయి. ఇక శుక్రవారం 22,97,257 మందికి టీకాలు ఇచ్చారు. దీంతో ఇప్పటివరకు 16.73కోట్ల మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story