దేశంలో కొత్తగా లక్షా 52 వేల 879 కేసులు.. 839 మంది మృతి..!
By - TV5 Digital Team |11 April 2021 4:59 AM GMT
దేశంలో కరోనా విలయం కొనసాగుతోంది. సెకండ్ వేవ్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. రోజువారి కేసులు గరిష్టస్థాయికి చేరుకున్నాయి
దేశంలో కరోనా విలయం కొనసాగుతోంది. సెకండ్ వేవ్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. రోజువారి కేసులు గరిష్టస్థాయికి చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో లక్షా 52 వేల 879 కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 839 మంది మృత్యువాడ పడ్డారు. దీంతో ఇప్పటివరకు లక్షా 69 వేల 275 మంది మరణించారు. అటు యాక్టివ్ కేసుల సంఖ్య 11 లక్షలు దాటింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11లక్షల 8 వేల 87 మందికి చికిత్స కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కోటి 33 లక్షల 58వేల 805 కేసులు నమోదవగా.. కోటి 20 లక్షల 81 వేల మంది డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 10కోట్ల 15లక్షల 95వేల 147 మందికి వ్యాక్సన్ ఇచ్చారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com