కశ్మీర్ లోయలో 24 గంటల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతం
By - Admin |29 Aug 2020 6:46 AM GMT
జమ్మూకశ్మీర్ ఎన్ కౌంటర్ల పర్వం కొనసాగుతుంది. పుల్వామా జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఎన్ కౌంటర్లో ముగ్గురు
జమ్మూకశ్మీర్ ఎన్ కౌంటర్ల పర్వం కొనసాగుతుంది. పుల్వామా జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఎన్ కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఓ జవాన్ కూడా అమరుడయ్యాడు. ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతున్నదని ఆర్మీ అధికారులు తెలిపారు. కాగా.. శుక్రవారం సాయంత్రం షోపియాన్ జిల్లాలో కూడా ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టిన విషయం తెలిసిందే. దీంతో 24 గంటల్లో కశ్మీర్ లోయలో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా గత కొంత కాలం నుంచి భద్రతాదళాలు సరిహద్దులు పగడ్భంధీగా గస్తీకాస్తున్న విషయం తెలిసిందే.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com