బిగ్‌బాస్ ఇంట్లో వేడి సెగలు.. మంటల్లో కంటెస్టెంట్లు

బిగ్‌బాస్ ఇంట్లో వేడి సెగలు.. మంటల్లో కంటెస్టెంట్లు
ఒక్కొక్కరిది ఒక్కో రీజన్.. ఏదో ఒక పాయింట్లో వాళ్లు నచ్చరు. అప్పటి వరకు వాళ్ల మీదున్న పాజిటివిటీ కూడా నెగిటివ్‌గా ..

ఆ మనిషి మీద అంత కసి.. అందుకే అతడి/ఆమె ఫోటోని మంటల్లో వేయాలి.. అదే టాస్క్.. ఒక్కొక్కరిది ఒక్కో రీజన్.. ఏదో ఒక పాయింట్లో వాళ్లు నచ్చరు. అప్పటి వరకు వాళ్ల మీదున్న పాజిటివిటీ కూడా నెగిటివ్‌గా మారిపోతుంది. మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటుంది.. హౌస్‌లో అందరికంటే గంగవ్వ ఒక్కతే కూల్‌గా ఉంటుంది.. తనని అడిగితేనే ఆన్సర్ ఇస్తుంది.. ఏమీ తెలియనట్లే ఉంటుంది కానీ అన్ని విషయాలను పరికిస్తుంది. అవకాశం వచ్చినప్పుడు నోరు విప్పుతుంది. అది అందరికీ ఆమోదయోగ్యంగానూ ఉంటుంది. దాదాపు కంటెస్టెంట్లందరూ అవ్వను గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక నిన్నటి టాస్క్ విషయానికి వస్తే.. కంటెస్టెంట్లు అరియానా-సోహైల్, సుజాత-అభిజిత్, మోనాల్-దివి, అమ్మ రాజశేఖర్-దేవి, హారిక-మెహబూబ్ ఫోటోలను మంటల్లో వేసి వారి మీద రివెంజ్ తీర్చుకున్నారు. ఇక పోయిన వారం ఎలిమినేట్ అయిన కరాటే కళ్యాణి హౌస్ నుంచి వెళ్లిపోతూ దేవి మీద బిగ్ బాంబ్ వేసింది. దాంతో ఆమె డైరెక్ట్‌గా ఎలిమినేట్ అయినట్టు లెక్క. చూడాలి ప్రేక్షకులు ఈ వారం ఓట్లేసి ఎవరిని ఎలిమినేట్ చేస్తారో.

Tags

Read MoreRead Less
Next Story