మరోసారి అస్వస్థతకు గురైన బీజేపీ ఎంపీ.. ముంబైకి తరలింపు.. !

మరోసారి అస్వస్థతకు గురైన బీజేపీ ఎంపీ.. ముంబైకి తరలింపు.. !
మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడటంతో.. ఆమెను వెంటనే విమానంలో ముంబైకి తరలించారు.

మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడటంతో.. ఆమెను వెంటనే విమానంలో ముంబైకి తరలించారు. ప్రస్తుతం కోకిలాబెన్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కాగా గతేడాది డిసెంబర్ లో ప్రజ్ఞా ఠాకూర్ కోవిడ్ కు చికిత్స పొందారు. 2008 మాలెగావ్ బాంబు దాడిలో నిందితురాలిగా ఉన్న ఆమెకు.. అనారోగ్య కారణాలతో 2017లో జాతీయ దర్యాప్తు సంస్థ బెయిలిచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ సింగ్‌పై 3.6 లక్షలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించింది. పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న వ్యక్తి ఎంపీగా గెలవడం దేశంలో ఇదే తొలిసారి కావడం విశేషం..!

Tags

Read MoreRead Less
Next Story