తమిళనాడు ఎన్నికలు : 20 సీట్లు... 30 మంది క్యాంపెయినర్లు..!

తమిళనాడు ఎన్నికలు : 20 సీట్లు... 30 మంది క్యాంపెయినర్లు..!
త్వరలో తమిళనాడు రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో తమ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్లను ప్రకటించింది బీజేపీ.

త్వరలో తమిళనాడు రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో తమ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్లను ప్రకటించింది బీజేపీ... ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తదితర ముఖ్య నేతలు ప్రచారం నిర్వహించనున్నారు.

ఇక ఇందులో స్థానిక బీజేపీ నేత, నటి గౌతమిని కూడా స్టార్‌ క్యాంపెయినర్‌గా అధిష్టానం ప్రకటించింది. రాజపాళయం సీటు నుంచి పోటీ చేద్దామని అనుకున్న గౌతమికి నిరాశే ఎదురైంది. అయితే ఆమె సేవలను అధిష్టానం స్టార్‌ క్యాంపెయినర్‌గా వినియోగించుకోవాలని అనుకుంది.

కాగా అన్నాడీఎంకే- బీజేపీ కూటమిలో సీట్ల కేటాయింపులో భాగంగా కాషాయ పార్టీకి 20 సీట్లు దక్కాయి. అటు ఏప్రిల్‌ 6న తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరుగనుండగా, మే 2 న ఫలితాలు వెలువడనున్నాయి.


బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్లు వీళ్ళే...!

1. నరేంద్ర మోదీ

2. జేపీ నడ్డా

3. రాజ్‌నాథ్‌ సింగ్‌

4. అమిత్‌ షా

5. నితిన్‌ గడ్కరీ

6.నిర్మలా సీతారామన్‌

7. స్మృతి ఇరానీ

8. ఎస్‌ జైశంకర్‌

9. కిషన్‌రెడ్డి

10. జనరల్‌ వీకే సింగ్‌(రిటైర్డు)

11. యోగి ఆదిత్యనాథ్‌

12. శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌

13. సీటీ రవి

14. పురందేశ్వరి

15. పి సుధాకర్‌ రెడ్డి

16. తేజస్వి సూర్య

17. ఎల్‌ గణేషన్‌

18. వీపీ దురైస్వామి

19.కేటీ రాఘవన్‌

20. శశికళ పుష్ప

21. గౌతమి తాడిమల్ల

22. రాధారవి

23. కేపీ రామలింగం

24. గాయత్రీ దేవి

25. రాజ్‌కుమార్‌ గణేషన్‌

26. విజయశాంతి

27. సెంథిల్‌

28. వెల్లూర్‌ ఇబ్రహీం

29. ప్రొఫెసర్‌ రామ శ్రీనివాసన్‌

30. ప్రొఫెసర్‌ కనగ సబాపతి

Tags

Read MoreRead Less
Next Story