కరోనా థర్డ్‌ వేవ్‌.. కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరికలు జారీ..!

కరోనా థర్డ్‌ వేవ్‌.. కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరికలు జారీ..!
కరోనా థర్డ్‌ వేవ్‌ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరికలను జారీ చేసింది. ప్రజలు కరోనా నిబంధనలు పాటించకపోతే.. మరోసారి ఆంక్షలను విధించాల్సి ఉంటుందని తెలిపింది.

కరోనా థర్డ్‌ వేవ్‌ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరికలను జారీ చేసింది. ప్రజలు కరోనా నిబంధనలు పాటించకపోతే.. మరోసారి ఆంక్షలను విధించాల్సి ఉంటుందని తెలిపింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సెకండ్ వేవ్ ప్రభావం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది. యాక్టివ్​ కేసులు సంఖ్య 5 లక్షల దిగువకు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గుర్తుచేశారు.

మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్​, అరణాచల్ ప్రదేశ్, త్రిపుర.. రాష్ట్రాల్లో కేసులు అధికంగా నమోదవుతున్నాయని లవ్ అగర్వాల్​ పేర్కొన్నారు. ఈ రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 10 శాతానికి మించిందన్నారు.భవిష్యత్తులో ప్రధాన సవాల్.. మూడో వేవ్ కాదని, దానిని మనం ఎలా ఎదుర్కొన్నాం అనేదే ముఖ్యమని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్. బలరాం భార్గవ వెల్లడించారు.

హిల్ స్టేషన్లకు పర్యటకులు పోటెత్తటంపై కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. హిమాచల్ ప్రదేశ్​లోని సిమ్లా, మనాలీలో ప్రజలు కొవిడ్​ నిబంధనలు పాటించట్లేదని పేర్కొంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. కరోనా మళ్లీ విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో పాటు దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తి అధికంగా ఉన్న 73 జిల్లాలకు లేఖ రాసింది వైద్య శాఖ.

Tags

Read MoreRead Less
Next Story