Chennai: ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరిని సన్మానించిన సీఎం స్టాలిన్

Chennai: ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరిని సన్మానించిన సీఎం స్టాలిన్
Chennai: కుండపోతగా కురుస్తున్న వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న జనం హాహాకారాలు.. రెస్క్యూ టీం నిర్విరామ శ్రమతో బాధితులు సురక్షిత ప్రదేశానికి చేరుకుంటున్నారు.

Chennai: ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరి పేరు ఇప్పుడు దేశమంతా మార్మోగిపోతోంది. ఓ వ్యక్తి ప్రాణం కాపాడేందుకు ఆమె చేసిన ప్రయత్నం అందరి ప్రశంసలు అందుకుంటోంది. తమిళనాడులో వరద సహాయక చర్యల్ని దగ్గరుండి పర్యవేక్షించడమే కాదు.. తాను కూడా రంగంలోకి దిగి రెస్క్యూ టీమ్‌కి సిసలైన అర్థం చెప్పారామె.

అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి ప్రాణాలు కాపాడిన టీపీ చత్రం ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరిని, ఇప్పుడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఘనంగా సన్మానించారు. ఆఫీసుకు పిలిపించి ఆమెను అభినందించి, ప్రశంసా పత్రాన్ని అందించారు.

కుండపోత వానకు చెన్నై అతలాకుతలమైపోయింది. నిన్న టీపీ చత్రం పరిధిలో వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు రాజేశ్వరి. ఐతే స్థానిక స్మశాన వాటికలో పని చేసే ఉదయ అనే వ్యక్తి వర్షంలో తడిసి స్పృహ కోల్పోయాడు. గమనించిన స్థానికులు చనిపోయాడు అనుకుని పోలీసులకు సమాచారం అందించారు. పరిశీలించిన పోలీసులు ఉదయ బతికే ఉన్నాడని గుర్తించారు.

వెంటనే అతన్ని భుజాలపై మోసుకెళ్లి ఆటో వరకు తీసుకెళ్లారు రాజేశ్వరి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమయస్ఫూర్తితో వ్యవహరించారంటూ రాజేశ్వరిపై ప్రశంసలు కురిపించారు నెటిజన్లు.

చెన్నై పోలీస్ కమిషనర్ శంకర్ జివాల్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరిని అభినందించారు. రాజేశ్వరి అద్భుతమైన పని చేశారని మెచ్చుకున్నారు. ప్రస్తుతం రాజేశ్వరి హాస్పిటల్ కు తీసుకెళ్లిన వ్యక్తి సేఫ్ గా ఉన్నాడని తెలిపారు. కుడోస్ అంటూ రాజేశ్వరిని అభినందించారు కమిషనర్.

Tags

Read MoreRead Less
Next Story