KCR Tamil Nadu Tour : కుటుంబ సమేతంగా శ్రీరంగం రంగనాథస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్‌

KCR Tamil Nadu Tour : కుటుంబ సమేతంగా శ్రీరంగం రంగనాథస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్‌
KCR Tamil Nadu Tour : తమిళనాడు పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్‌ కుటుంబ సమేతంగా శ్రీరంగం చేరుకున్నారు. రంగనాథ ఆలయ ప్రాంగణంలో కేసీఆర్‌కు పూర్ణకుంభం స్వాగతం లభించింది.

KCR Tamil Nadu Tour : తమిళనాడు పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్‌ కుటుంబ సమేతంగా శ్రీరంగం చేరుకున్నారు. రంగనాథ ఆలయ ప్రాంగణంలో కేసీఆర్‌కు పూర్ణకుంభం స్వాగతం లభించింది. తిరుచ్చి జిల్లా కలెక్టర్‌ శివరాసు, తమిళనాడు మంత్రి అరుణ్‌ నెహ్రూ... సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికి ఆలయంలోకి తీసుకెళ్లారు. శ్రీరంగం రంగనాథస్వామి ఆలయంలో కేసీఆర్‌.. కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. గజరాజు ఆశీర్వాదం తీసుకున్నారు. కేసీఆర్‌.. ప్రత్యేక విమానంలో తిరుచిరాపల్లి వెళ్లి, అక్కడి నుండి రోడ్డు మార్గంలో శ్రీరంగం చేరుకున్నారు. రంగనాథస్వామి దర్శనం అనంతరం అక్కడి నుంచి చెన్నై చేరుకొని రాత్రి అక్కడే బస చేయనున్నారు. తమిళనాడు పర్యటనలో రేపు సీఎం స్టాలిన్‌తో కేసీఆర్‌ సమావేశమయ్యే అవకాశం ఉంది. కేంద్రం వైఖరి, రాజకీయ అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

మార్చి 28న జరగనున్న యాదాద్రి ఆలయ మహాకుంభ సంప్రోక్షణకూ స్టాలిన్‌ను ఆహ్వానించనున్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్‌ తమిళనాడు పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags

Read MoreRead Less
Next Story