ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో విషాదం..
By - TV5 Digital Team |3 Jan 2021 11:15 AM GMT
యూపీలోని ఘజియాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. మురాద్ నగర్ లో వర్షం కారణంగా స్మశానవాటిక ఘాట్ కాంప్లెక్స్ లోని పైకప్పు కూలింది.
యూపీలోని ఘజియాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. మురాద్ నగర్ లో వర్షం కారణంగా స్మశానవాటిక ఘాట్ కాంప్లెక్స్ లోని పైకప్పు కూలింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. మరికొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని ఆదేశించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com