కర్ణాటకలో కొత్తగా 8852 పాజిటివ్ కేసులు
By - Admin |30 Aug 2020 4:20 PM GMT
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇక కర్ణాటకలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. కర్ణాటక రాష్ర్టవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 8,852 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,35,928కి చేరింది. కరోనా బారిన పడి ఒక్కరోజే 106 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 5,598కి పెరిగింది. కర్ణాటకలో ఇప్పటి వరకు కరోనా బారి నుంచి కోలుకుని 2,42,229 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 88,091 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com