కర్ణాటక సీఎం యడియూరప్పకు మళ్లీ కరోనా పాజిటివ్

కర్ణాటక సీఎం యడియూరప్పకు మళ్లీ కరోనా పాజిటివ్
కర్ణాటక సీఎం యడియూరప్పకు మళ్లీ కరోనా పాజిటివ్ వచ్చింది. రెండు రోజుల నుంచి స్వల్ప జ్వరం ఉండడంతో కరోనా టెస్టులు చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని ఆయన ట్వీట్ చేశారు.

కర్ణాటక సీఎం యడియూరప్పకు మళ్లీ కరోనా పాజిటివ్ వచ్చింది. రెండు రోజుల నుంచి స్వల్ప జ్వరం ఉండడంతో కరోనా టెస్టులు చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని ఆయన ట్వీట్ చేశారు. ఇటీవల తనను కలిసిన వారందరూ టెస్టులు చేయించుకోవాలని సూచించారు. కాగా యడియూరప్పకు కరోనా పాజిటివ్ రావడం ఇది రెండోసారి. గతంలో కూడా ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేరళ సీఎం పినరయి విజయన్ కు వైరస్ వచ్చింది. ఇక కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ లను కరోనా వదల్లేదు.

కేంద్రమంత్రులు ప్రకాష్ జవదేకర్, సంతోష్‌ కుమార్ గంగ్వార్, సంజీవ్ బలియాన్, అర్జున్ ముండాలకు కరోనా నిర్థారణ అయింది. ఇక కాంగ్రెస్ సీనీయర్ నేతలు దిగ్విజయ్ సింగ్, రణ్ దీప్ సింగ్ సుర్జేవాలా కరోనా బారిన పడ్డారు. ఇక కేంద్ర మాజీ మంత్రి హర్ సిమ్రత్ కౌర్ కు కూడా కరోనా సోకింది. వీరితో పాటు మహారాష్ట్ర మంత్రి ఆదిత్యథాక్రే, సీపీఐ జాతీయ నేత డి.రాజా, డీఎంకే ఎంపీ కనిమొళిలకు కరోనా నిర్థారణ అయింది.

Tags

Read MoreRead Less
Next Story