భారత్‌లో ఉధృతమవుతున్న కరోనా వైరస్‌.. బుధవారం రికార్డు స్థాయిలో కేసుల నమోదు..!

భారత్‌లో ఉధృతమవుతున్న కరోనా వైరస్‌.. బుధవారం రికార్డు స్థాయిలో కేసుల నమోదు..!
భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతమవుతోంది. కొత్తగా నమోదవుతున్న కేసులతో పాటు, యాక్టివ్‌ కేసులు, మరణాల సంఖ్యలోనూ పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది.

భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతమవుతోంది. కొత్తగా నమోదవుతున్న కేసులతో పాటు, యాక్టివ్‌ కేసులు, మరణాల సంఖ్యలోనూ పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. బుధవారం రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 10.65 లక్షల పరీక్షలు చేయగా.. 53 వేల 476 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య ఒక కోటి 17 లక్షల 87 వేల 534కి చేరింది. కొత్తగా 26 వేల 490 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య ఒక కోటి 12 లక్షల 31 వేల 650కు చేరింది. రికవరీ రేటు 95.49శాతంగా ఉంది.

ఇక కరోనా మరణాలు మంగళవారం 275 నమోదు కాగా.. బుధవారం 251 మంది మరణించారు. దీంతో వైరస్‌ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య ఒక లక్షా 60 వేల 692కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 3 లక్షల 95 వేల 192కి పెరిగింది. అటు.. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 23.03లక్షల మందికి టీకా వేశారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా టీకా తీసుకొన్న వారి సంఖ్య 5 కోట్ల 31 లక్షల 45 వేల 709కి చేరింది.

మరోవైపు.. మహారాష్ట్రలో కరోనా వైరస్‌ భయపెడుతోంది. బుధవారం ఒక్కరోజే 32 వేల 855 కేసులు నమోదయ్యాయి. ఒక్క ముంబయి నగరంలోనే 5వేలకు పైగా కేసులు వెలుగుచూడటం బెంబేలెత్తిస్తోంది. గడిచిన 24 గంటల్లో 95 మంది మరణించగా.. , 15 వేల 98 మంది కోలుకొన్నారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 1.87కోట్ల నమూనాలు‌ పరీక్షించగా 25.64 లక్షల మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 22.62 లక్షల మంది కోలుకోగా.. 53 వేల 684 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 2.47లక్షల వేల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story