తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం : 11 మంది మృతి
By - TV5 Digital Team |12 Feb 2021 11:16 AM GMT
తమిళనాడు విరుధ్నగర్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. టపాసుల తయారీ కేంద్రంలో భారీ పేలుడు జరిగి పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి.
తమిళనాడు విరుధ్నగర్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. టపాసుల తయారీ కేంద్రంలో భారీ పేలుడు జరిగి పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో 11మంది సజీవదహనం కాగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలు అదుపుచేయటానికి దాదాపు 30 మంది అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com