దేశవ్యాప్తంగా ఒక్క రోజులో 2,34,692 కేసులు.. 1,341 మరణాలు

దేశవ్యాప్తంగా ఒక్క రోజులో  2,34,692 కేసులు.. 1,341 మరణాలు
వరుసగా మూడో రోజు కొవిడ్‌ కేసులు రెండు లక్షలకు పైనే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 14లక్షల 95 టెస్టులు చేయగా 2లక్షల 34వేల 692 కేసులు బయటపడ్డాయి.

దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. వరుసగా మూడో రోజు కొవిడ్‌ కేసులు రెండు లక్షలకు పైనే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 14లక్షల 95 టెస్టులు చేయగా 2లక్షల 34వేల 692 కేసులు బయటపడ్డాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య కోటి 45లక్షల 26వేల 609కు చేరింది. కొత్తగా లక్షా 23వేల 354 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య కోటి 26లక్షల 71వేల 220 చేరింది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 87.80 శాతంగా ఉంది.

ఇక రెండో దశలో మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని రోజులుగా రోజుకు వెయ్యి మందికి పైనే కరోనాకు బలవుతున్నారు. తాజాగా వెయ్యి 341 మంది వైరస్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దేశంలోకి కరోనా ప్రవేశించిన తర్వాత ఒక రోజులో ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. అంతకుముందు కొవిడ్‌ తొలి దశలో గతేడాది సెప్టెంబరులో ఒకరోజులో అత్యధికంగా 1200 మంది మృత్యువాతపడ్డారు.

దేశంలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య లక్షా 75వేల 649కు చేరింది. ఇక మరణాల రేటు 1.22శాతానికి చేరింది. దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం 16లక్షల 79వేల 740 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కేసులు పెరుగుతున్న తరుణంలో వ్యాక్సినేషన్‌ను ప్రభుత్వం వేగవంతం చేసింది. నిన్న మొత్తం 30లక్షల 400 మందికి టీకాలు వేయగా.. మొత్తం టీకాలు పొందిన వారి సంఖ్య 11కోట్ల 99 లక్షలకు చేరింది.

Tags

Read MoreRead Less
Next Story