నేను మహీని చూడాలనుకుంటున్నాను: సాక్షి

నేను మహీని చూడాలనుకుంటున్నాను: సాక్షి
అనుభవజ్ఞులైన ఆటగాళ్లు సురేష్ రైనా, హర్భజన్ సింగ్ లేకుండా సిఎస్‌కె ఉంటోంది కాబట్టి ఈసారి ధోనిపై ఒత్తిడి అధికంగా ఉంటుంది

ఎంఎస్ ధోనిని పట్టుకోవడం అంత సులభం కాదు. అతని సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా ఇదే మాట అంటారు. ఇప్పుడు అతని భార్య సాక్షి కూడా మహినీ ఒకసారి చూపించరా అని అడుగుతోంది. దుబాయ్ లో రేపు జరగనున్న ఐపీఎల్ 2020 మ్యాచ్ కోసం గ్రౌండ్ లో ధోనీ టీమ్ సభ్యులు ప్రాక్టీస్ చేస్తున్నారు. CSK ప్రాక్టీస్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌ వీడియో స్ట్రీమింగ్‌ను నిర్వహిస్తున్న సిఎస్‌కె టీమ్ మేనేజర్ రస్సెల్ రాధాకృష్ణన్‌ నిర్వహిస్తున్నారు. ధోని భార్య సాక్షి మహీని చూపించమని రస్సెల్ ను అభ్యర్థించారు. దాంతో కెమెరా వెంటనే ధోని వైపుకు తిప్పారు రస్సెల్. మహీని చూసిన సాక్షి 'థాంక్స్' అని రిప్లై ఇచ్చింది.

గత ఏడాది జూలైలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే ప్రపంచ కప్ సెమీస్‌లో చివరిసారిగా పోటీ మ్యాచ్ ఆడిన ధోని, ఐపిఎల్ 2020 లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్‌తో కలిసి సిఎస్‌కె పాల్గొంటోంది. 14 నెలల విరామం తర్వాత థోనీ ఈ మ్యాచ్ లో పాల్గొంటున్నాడు. అనుభవజ్ఞులైన ఆటగాళ్లు సురేష్ రైనా, హర్భజన్ సింగ్ లేకుండా సిఎస్‌కె ఉంటోంది కాబట్టి ఈసారి ధోనిపై ఒత్తిడి అధికంగా ఉంటుంది. రైనా మరియు హర్భజన్ ఇద్దరూ వ్యక్తిగత కారణాలను చూపిస్తూ ఐపిఎల్ 2020 నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story