Kamal Haasan : వారంతా ద్రోహులంటూ కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు..!
ఇటీవల వెలువడిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ కోయంబత్తూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇప్పుడా పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే ఆ పార్టీని పలువురు వీడగా.. తాజాగా పార్టీలో నెంబర్ 2 అని చెప్పుకునే ఉపాధ్యక్షుడు ఆర్.మహేంద్రన్ సైతం రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్కు పలు కారణాలను వివరిస్తూ లేఖ రాశారు.
అయితే ఆయన రాజీనామా పట్ల కమల్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఆయన్ను 'ద్రోహి'గా అభివర్ణించారు. మహేంద్రన్ రాజీనామా చేయకపోయినా.. తామే పార్టీ నుంచి తొలగించేవారమని అన్నారు. పార్టీ నుంచి ఓ 'కలుపు మొక్క' బయటకు వెళ్లిందని.. దానికి తాము హర్షిస్తున్నామని వ్యాఖ్యానించారు. కొంతమంది రాజీనామా వల్ల పార్టీ లక్ష్యం మాత్రం మారదని పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కాగా ఎన్నికల ఫలితాల్లో 234స్థానాలకి గాను డీఎంకే 133స్థానాలను గెలుచుకుంది. అన్నాడీఎంకే 66, కాంగ్రెస్ 18, పీఎంకే 5, బీజేపీ 4 స్థానాలకే పరిమితమయ్యాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com