కర్ణాటకలో రాసలీలల సీడీ కేసు దర్యాప్తు ముమ్మరం

కర్ణాటకలో రాసలీలల సీడీ కేసు దర్యాప్తు ముమ్మరం
రంగంలోకి దిగిన సిట్‌.. వెంటనే ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నారు.

కర్ణాటక రాజకీయాల్లో సంచలనం రేపిన ఓ మాజీ మంత్రి రాసలీలల సీడీ కేసు దర్యాప్తు ముమ్మరమైంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సౌమేంద్రు ముఖర్జీ నేతృత్వంలో ఏడుగురు అధికారులతో సిట్‌ ఏర్పాటు చేసింది. రంగంలోకి దిగిన సిట్‌.. వెంటనే ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. సీడీని ప్రసార మాధ్యమాలకు అందించే 3 గంటల ముందే బెంగళూరు నుంచి అంతర్జాలంలో అప్‌లోడ్‌ చేసినట్టు గుర్తించారు.

అటు.. సీడీని బయటపెట్టి పోలీసులకు ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త దినేశ్‌ను విచారించిన బృందం.. అతని నుంచి రాబట్టిన అంశాల ఆధారంగానే ఐదుగురు పాత్రికేయులు, రామనగరకు చెందిన ఓ యువతిని అదుపులోకి తీసుకుంది. సీడీలో సన్నివేశాలను ఎడిట్‌ చేసి, ప్రసారం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీడీని మొదటిగా కబ్బన్‌పార్కు పోలీసులకు అందించిన దినేశ్‌ను.. మరోసారి విచారణ చేస్తామని సిట్‌ ఛీఫ్‌ సౌమేంద్రు ముఖర్జీ తెలిపారు.



Tags

Read MoreRead Less
Next Story